అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులు ఇప్పటికే 12ప్రాంతాలు గుర్తించారు. నల్లమల పరిధిలో మన్ననూరు, సోమశిలలో వసతి, శ్రీశైలం ఆలయ సందర్శన, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో సఫారీ, అభయారణ్యంలో ట్రెక్కింగ్, కృష్ణా బ్యాక్‌వాటర్‌లో బోటింగ్ ఉండనుంది. దీంతో స్థానికంగా ఉపాది, ఖజానాకు ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.