News July 3, 2024
బస్సులోనే మత్తు పెట్టి భారీగా నగదు చోరీ చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. విజయవాడ నుంచి ఇద్దరు వ్యాపారులు రూ.80 లక్షలతో బెంగళూరుకు బయల్దేరారు. కావలి సమీపంలోని మద్దూరుపాడు దాబా వద్ద భోజనానికి ఆపారు. ఇందులో ఒకరు దాబాలో తిని మరొకరికి పార్శిల్ తీసుకు రావడానికి వెళ్లారు. బస్సులో ఉన్న దొంగలు అతడికి మత్తు పెట్టి అతని వద్ద ఉన్న రూ.80 లక్షల డబ్బు సంచి తీసుకుని రోడ్డు దాటుకుని మరొక వాహనంలో పరారయ్యారు.