టాలీవుడ్ లవర్ బాయ్ సిద్ధార్థ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఓయ్ ఒకటి. డైరెక్టర్ ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకుంది. అప్పట్లో ఈ మూవీ స్టోరీ జనాలకు అంతగా కనెక్ట్ కాలేదు. కానీ మ్యూజిక్ పరంగా హిట్ అయ్యింది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఓయ్ మూవీ సాంగ్స్ వినిపిస్తుంటాయి. గతంలో బాక్సా్‌ఫీస్ వద్ద పరాజయమైన ఈ సినిమా ఇటీవల రీరిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా మళ్లీ విడుదల చేస్తే థియేటర్స్ నిండిపోయాయి. అంతేకాదు యూత్ నుంచి ఈ సినిమాకు ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సిద్ధార్థ్, షామిలి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఓయ్ సినిమా పాటలతో థియటర్లలో జోష్ నెలకొంది. ఈ సినిమా విడుదలై నేటికి పదిహేళ్లు అవుతుంది.

ఇక ఇదే విషయాన్ని చెబుతూ తన సంతోషాన్ని బయటపెట్టాడు డైరెక్టర్ ఆనంద్ రంగా. ఓయ్ విడుదలై నేటికి పదిహేనేళ్లు అంటూ ట్వీట్ చేయగా.. నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అయ్యారు. ఓయ్ సినిమాకు సీక్వెల్ తీయమని ఓ నెటిజన్ అడగ్గా.. ఎవరు యాక్ట్ చేస్తారు..? ఎవరు నిర్మిస్తారు..? అని రిటర్న్ క్వశ్చన్ అడిగాడు. అలాగే మళ్లీ ఓయ్ సినిమాను రీరిలీజ్ చేయాలని మరో నెటిజన్ అడగ్గా.. ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా సింపుల్ గా దండం పెట్టేశాడు.

ఓయ్ సినిమా వంటి మంచి సినిమాను మళ్లీ తీయాలని మరో నెటిజన్ అడగ్దా.. తప్పకుండా అంటూ రిప్లై ఇచ్చాడు. సినిమాను వైజాగ్ లో ఎందుకు షూట్ చేశారని అడగ్గా.. తనకు వైజాగ్ అంటే చాలా ఇష్టమని అందుకే చేశానని అన్నారు. ఇటీవల ఓయ్ రీరిలీజ్ సందర్భంగా ఓ నెటిజన్ ఇంత మంచి సినిమా తీసి ఎక్కడికిపోయావ్.. గుండు నాయాలా అంటూ మాట్లాడితే లైట్ తీసుకున్నాడు ఆనంద్ రంగా. నిజమే నాది గుంటూ అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇవ్వడంతో వెంటనే సదరు నెటిజన్ సారీ చెప్పేశాడు. ఇక ఇప్పుడు మరోసారి నెట్టింట అభిమానులతో ముచ్చటించాడు ఆనంద్ రంగా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.