ఎక్కడ ఆపారో అక్కడే మొదలుపెట్టారు పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇద్దరికీ టైమ్ బాగోలేదు. అప్పుడొచ్చిన హిట్టు.. మళ్లీ ఇప్పటి వరకు రానని మొండికేసింది. అందుకే డబుల్ ఇస్మార్ట్‌తో డబుల్ స్పీడ్‌లో దాన్ని ఒడిసిపట్టుకోవాలని ఫిక్సైపోయారు ఈ జోడీ. దానికోసమే చేయాల్సిన మాస్ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.