సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి వెంకట్‌ కళ్యాణ్ దర్శకుడు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. రుస్తుం, టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ, ప్యాడ్‌, పారి లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాలను నిర్మించిన ప్రేర్నా అరోరా ఓ లీడింగ్ స్టూడియోతో కలిసి సుధీర్ బాబు సినిమాను నిర్మించబోతున్నారు. సుధీర్ బాబుకు బాలీవుడ్‌లోనూ గుర్తింపు ఉంది.