బార్బడోస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. భారత్ గెలుపులో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇక కప్ గెలిచిన అనంతరం గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు హార్దిక్. గత కొన్నినెలలుగా తాను పడుతోన్న మానసిక వేదన గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ భార్య నటాషా అసలు స్పందించకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. హార్దిక్ వైఫ్‌ నటాషా.. భారత్ చారిత్రాత్మక విక్టరీని.. సెలబ్రేట్ చేసుకోవడం కాదుకదా… అటు హార్దిక్ కు కానీ, ఇటు టీమిండియాకు కానీ విషెస్ చెబుతూ ఒక్క పోస్ట్ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేయలేదు. దీంతో ఈమె తీరు మరోసారి హార్దిక్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. ఆమెపై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ప్రభాస్‌ ఒక్కడి కారణంగా 5వేల కోట్లు లాభం

తల్లీ కూతురిని గదిలో బంధించి అడ్డుగోడ కట్టేసిన బంధువులు