హీరో రాజ్ తరుణ్ (Raj tarun) నిన్నంతా వార్తల్లో ఉన్నాడు. ఆయనపై లావణ్య (lavanya) అనే యువతి కేసు పెట్టడమే ఈ సెన్సేషన్ కు కారణం. మీడియా నుంచి తప్పించుకోకుండా అవును లావణ్యతో కొంతకాలం కలిసే ఉన్నానని ఒప్పుకున్నాడు రాజ్ తరుణ్. అనేక కారణాలతో ఆమె నుంచి దూరంగా ఉంటున్నట్లు చెప్పాడు. ఈ కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. రెండు వైపులా నిజాలు తెలుసుకునేందుకు లావణ్యకే ముందు నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ పై పెట్టిన కేసుకు ఆధారాలు చూపాలంటూ లావణ్యకు నోటీసులు (Police notices) ఇచ్చారు పోలీసులు. అయితే పోలీసులకు లావణ్య ఫోన్ లో అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది. లావణ్యతో తాను కలిసి ఉన్నట్లు రాజ్ తరుణ్ ఒప్పుకున్నాడు. అయితే ఆమె వ్యవహారాలు నచ్చకే దూరంగా ఉంటున్నట్లు చెప్పాడు. మరోవైపు రాజ్ తరుణ్ కొత్త సినిమా తిరగబడరా సామి (thiragabadara saami) రిలీజ్ కు రెడీ అవుతోంది.