వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శర్వానంద్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఇటీవల డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో.. మనమే సినిమాతో అడియన్స్ వచ్చాడు శర్వా..! అయితే ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై ఈ మూవీ మిక్స్డ్ టాక్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీకి రెడీ అయిపోయింది. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్, కృతి కలిసి నటించిన మనమే సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూలై 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Maharaja: గుడ్ న్యూస్ OTTలోకి వచ్చేస్తోన్న మహరాజా…

TOP 9 ET News: ప్రభాస్ పేరుతో మోసం..అవి అస్సలు నమ్మకండి