శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన మనమే (Maname) సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియో (Prime video)లో నెక్ట్ వీక్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. దీనిపై అ‌ఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిఉంది. శర్వానంద్ సరసన కృతి శెట్టి (Kriti shetty) నటించిన మనమే చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ (People media factory) నిర్మించింది. గత నెల 7వ తేదీన థియేటర్స్ లోకి వచ్చిన మనమే సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మెప్పించలేకపోయింది. స్లో నెరేషన్, ఎగ్జైట్ చేయని కథతో సక్సెస్ ఫుల్ సినిమా కాలేకపోయింది. ఈ చిత్రంతో మరోసారి శర్వానంద్, కృతి శెట్టిలకు నిరాశే ఎదురైంది. ఓటీటీలైనా మంచి రెస్పాన్స్ వస్తుందని టీమ్ ఆశిస్తున్నారు.