దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన వారిలో రంభ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. విజయవాడకు చెందిన రంభ.. విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. అందంతోపాటు అద్భుతమైన నటనతో మెప్పించి అప్పట్లో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ గా మారారు. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించి అలరించారు. ఎట్ ప్రజెంట్ సినిమాలు మానేసి.. తన మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎదిగిన తన పిల్లలను చూసుకుంటూ.. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో రీల్స్‌ చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటారు. ఈక్రమంలోనే తన భర్త ఇంద్ర, ముగ్గురు పిల్లలు, కొరియోగ్రాఫర్ కళా మాస్టర్తో కలిసి గురువాయూర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా.. అందులో రంభ కూతురు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది.

ఇక ఆ వీడియోలో రంభ కూతురు పింక్ చుడీదార్ లో ఎంతో సింపుల్ గా కనిపించింది. తల్లి కంటే మరింత అందంగా.. న్యాచురల్ బ్యూటీగా ఉందనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటోంది. ప్రస్తుతం రంభ ఫ్యామిలీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా..రంభ కూతురిని చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. అందంలో అమ్మను మించి పోయిందని.. సింపుల్ గా ఎంతో చక్కగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.