“మనసంతా నువ్వే” (Manasantha nuvve), “నేనున్నాను” (nenunnanu) వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు వీఎన్ ఆదిత్య. ఆయన తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాను ఓంఎంజీ ప్రొడక్షన్స్ (OMG productions) బ్యానర్ లో డాక్టర్ మీనాక్షి అనిపిండి (Dr meenakshi anipindi)నిర్మించనున్నారు.

ఈ నెల 7వ తేదీన ఆదివారం డల్లాస్ లో ఈ సినిమా ఆడిషన్స్ జరిగాయి. ఈ ఆడిషన్స్ లో అమెరికన్, స్పానిష్, యురోపియన్, ఆఫ్రికన్, ఏషియన్, ఇండియా నుంచి తమిళ, కన్నడ, తెలుగు ఔత్సాహిక నటీనటులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆడిషన్స్ పట్ల దర్శకుడు వీఎన్ ఆదిత్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు వీఎన్ ఆదిత్య కొత్త సినిమా పూజా కార్యక్రమాలు, ముహూర్తం తేదీ, షూటింగ్ అప్డేట్స్ త్వరలో చిత్ర నిర్మాణ సంస్థ ఓఎంజీ ప్రొడక్షన్స్ వెల్లడించనుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఓ మంచి కథతో దర్శకుడు వీఎన్ ఆదిత్య తన కొత్త సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన డాలస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్ కి, డాలస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్ కి, ఫేస్ బుక్ పేజెస్ ఎడ్మిన్స్ కి , శ్రీమతి సజిత నాయుడు తిరుమల శెట్టి కి, రష్మికి, వరుణ్ కి, జీషన్ కి, శ్యామ్ కట్రు, కమల్ నందికొండ, వరుణ్, కార్తీక్ అనిపిండి, డా.ఇస్మైల్ గారికి, శ్రీనివాస్ కల్లూరి, గోవర్ధన్, కిషన్ గార్లకి, లాకింటా హోటల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ కి, మీడియా ఇన్ చార్జ్ మమతా కాసం గారికి, తన వ్యాఖ్యానం తో అందరినీ అలరించిన కుమారి సంహిత అనిపిండి కి, నిర్మాతలు డా. మీనాక్షి అనిపిండి, శ్రీ శాస్త్రి అనిపిండి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.