వనపర్తి: ఉపాధ్యాయుల కొరతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు.

మండల కేంద్రమైన వాల్మీకి చౌరస్తాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన సంఘటన చిన్నంబావి మండలంలోని అయ్యవారిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది.

ఆరుగురు ఉపాధ్యాయులు అవసరమున్న ఈ పాఠశాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పాఠశాలకు తాళం వేసి ఆందోళనకారులు ఉపాధ్యాయుల కొరతను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.