మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు మరియు ఆర్థిక సమస్యలతో వారు ఇబ్బంది పడుతూ చివరికి ఆత్మహత్య చేసుకున్నారు.  జనగాం జిల్లా చిల్పూరు మండలం కొండాపూర్ గ్రామంలో మోతె రాజు(37) అనే రైతు పురుగుమందు తాగి మృతి చెందాడు. పంట సాగు కోసం రాజు రూ.5 లక్షలు అప్పు తీసుకున్నా తీర్చలేకపోయాడు.

మరో ఘటనలో భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కళ్లెం లింగయ్య(35) కూడా ఇదే తరహాలో ఆత్మహత్య చేసుకున్నాడు. లింగయ్యకు రూ.4 లక్షల వరకు అప్పులు ఉన్నాయని, కుటుంబ పోషణ లేక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. పురుగుమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.