అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. గత వారం పది రోజుల పాటు ముంబైలో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సభ్యులు పెళ్లికి ముందు జరిగే వేడుకలలో కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు.

తాజాగా ముఖేష్ అంబానీ మరియు నీతూ అంబానీల కూతురు ఇషా అంబానీ తమిళనాడు స్టైల్‌లో మరింత ప్రకాశవంతంగా మెరిసింది. గులాబీ రంగు అంచు మరియు గోల్డ్ కలర్ బ్లౌజ్‌తో కూడిన టీల్ రా సిల్క్ టీల్ రా సిల్క్ లెహంగా ధరించి హైలెట్ అయ్యింది.

భారీ గా అలంకరించబడిన బంగారు హారము కూడా అదనపు ఆకర్షణగా మారింది. ఈ బంగారు నెక్లెస్ ఆమె అందాన్ని మరింత పెంచింది. తమిళనాడు వధువులకు సాంప్రదాయక హెయిర్ స్టైల్స్ అద్భుతంగా కనిపిస్తాయి.

ఈ వేడుకల్లో ఇషా అంబానీ జడ మరింత అందంగా కనిపిస్తోంది. పైన మొత్తం పువ్వుల మొగ్గలతో కొప్పు వేసి.. బ్రెయిడ్ మొత్తం గోల్డ్ థ్రెడ్ వర్క్ చేశారు. చివర్లో జడ కుచ్చిళ్లు బంగారు సూర్యచంద్రుడిలా హైలెట్ చేశారు. ఇక చెవులకు కూడా గోల్డ్ స్టడ్స్ తో మరింత అందంగా కనిపించారు.

ఆసియాలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మరియు నీతూ అంబానీల ముద్దుల కుమార్తె ఇషా అంబానీ ను ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.