పిఠాపురంకు చెందిన మరియమ్మ (Mariyamma) అనే మహిళకు ఆటో బహుమతిగా ఇచ్చి తన మాట నిలబెట్టుకున్నారు నిర్మాత ఎస్ కేఎన్ (producer SKN). మరియమ్మకు ఎస్ కేఎన్ ఆటో బహుమతిగా ఇచ్చిన వార్త, ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సక్సెస్ పుల్ సినిమాలు చేస్తూ నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న ఈ యంగ్ ప్రొడ్యూసర్ తన ఛారిటీ కార్యక్రమాలతో కూడా పాపులర్ అవుతున్నారు. ఏపీలో ఎన్నికల సమయంలో పిఠాపురంకు చెందిన మరియమ్మ అనే మహిళ పవన్ కల్యాణ్ (Pawan kalyan)గెలిస్తే తన భర్త రిక్షా నడపగా వచ్చిన డబ్బులతో ఊరిలోని వారికి పార్టీ ఇస్తానని ఓ మహిళ సంతోషంగా యూట్యూబ్ ఛానెల్ తో చెప్పింది.

ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఎస్ కేఎన్ దృష్టికి వచ్చాయి. ఆయన స్పందించి ఆమె కోరుకున్నట్లు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలిస్తే మరియమ్మకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు పిఠాపురం (Pitapuram) వెళ్లి మరియమ్మకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. ఎస్ కేఎన్ సేవాగుణానికి ప్రశంసలు దక్కుతున్నాయి.