రాధిక మర్చంట్, అనంత్ అంబానీల వివాహం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద వివాహ వేడుకలలో ఒకటిగా నిలిచింది. జూలై 12 నుంచి ముంబైలో ప్రారంభమైన ఈ ఈవెంట్ మూడు రోజుల పాటు జరగనుంది. ఈ అద్భుత ఘ‌ట‌న‌ను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు వ‌చ్చారు. అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ జూలై 12న వివాహం చేసుకున్నారు. అనంతరం జులై 13న శుభాశీస్సులు అందజేస్తున్నారు. ఈ జంటను ఆశీర్వదించేందుకు పలువురు ప్రముఖులు చేరుకున్నారు. ఈ పెళ్లి వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. వీరితో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు. మంగళ్ ఉత్సవ్ జూలై 14న గ్రాండ్ రిసెప్షన్‌తో ముగుస్తుంది.