భారత స్టార్ మాజీ క్రికెట్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు తలా అని ముద్దుగా పిలుచుకుంటారు. భారత క్రికెట్ టీంలో అత్యంత ఎక్కువగా క్రేజ్ ఉన్న ప్లేయర్ ధోని. మైదానంలో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా సోషల్ మీడియా రంగాన్ని కూడా శాసిస్తున్నాడు. ధోనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 49.3 మిలియన్ల మంది ఫాలోవర్స్, ఎక్స్ (గతంలో ట్విటర్‌లో) 8.6 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 27 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. నెట్టింట అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో ఒకరిగా నిలిచాడు. సోషల్ మీడియాలో ధోని చేసిన ఏ పోస్ట్ అయినా క్షణాల్లో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు.. క్షణాల్లో మిలియన్ లైక్స్, షేర్స్ అవుతుంటాయి. అయితే MS ధోని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో కేవలం నలుగురి ఫాలో అవుతున్నారని గమనించారా..? అవును.. 49.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ధోని కేవలం నలుగురిని మాత్రమే ఫాలో అవుతున్నాడు.

అలాగే ట్విట్టర్ ఖాతాలో కేవలం 33 ప్రముఖ వ్యక్తులను అనుసరిస్తున్నారు. ఇన్ స్టాలో తన భార్య సాక్షి సింగ్, కుమార్తె జివా సింగ్ ధోనీ, ఈజాఫార్మ్స్ అనే వ్యవసాయ వ్యవసాయ ఖాతా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను మాత్రమే ఫాలో అవుతున్నారు. అతను తన సన్నిహితులను లేదా భారత క్రికెట్ ఆటగాళ్లను కూడా ఫాలో కావడం లేదు. ధోని తన కుటుంబం, సన్నిహిత సంబంధాలతో పంచుకునే ప్రత్యేక బంధాన్ని ప్రదర్శిస్తూ చిత్రం వైరల్ అయింది. అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లు, అనంత్-రాధిక వెడ్డింగ్ ఈవెంట్‌లో ఇటీవల ధోని కనిపించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Dhoni

ధోని కొత్త లుక్ సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇతర ప్రముఖులతో కలిసి MS ధోని డ్యాన్స్, సంతోషంగా, నవ్వుతున్న ఫోటోల క్లిప్‌లు వైరలయ్యాయి. సోషల్ మీడియాలో ధోని తన కుటుంబం, సన్నిహిత సంబంధాలపై ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నాడనే విషయాన్ని హైలైట్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.