ఈ వార్తను అనువదించండి:

మంత్రి అచ్చెన్నాయుడు: టీడీపీ పొలిటికల్ బ్యూరో సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.అలాగే త్వరలో జన్మభూమి-2 కార్యక్రమం ఉంటుందని అన్నారు. జిల్లా యూనిట్‍గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి జాబితా చంద్రబాబు వద్ద ఉందని అన్నారు. అందరి మన్ననలు పొందేలా నామినేటెడ్ పోస్టుల జాబితా ఉంటుందని.. త్వరలోనే పార్టీ సభ్యత్వం ప్రారంభించనున్నట్లు చెప్పారు. టీడీపీ సభ్యత్వం తీసుకునే వారికి రూ.5లక్షల జీవిత బీమా అందించనున్నట్లు తెలిపారు.

పూర్తిగా చదవండి..