ఈ వార్తను అనువదించండి:

మద్యం కుంభకోణం కేసు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దాఖలైన తుది ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ ఛార్జిషీట్ స్క్రూట్నీ చేయాల్సి ఉందని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్‌లో పేపర్లకు ఒక వైపు మాత్రమే పేజ్ నంబర్ ఉందని వాదనలు వినిపించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని కోర్టుకు చెప్పారు. ఈనెల 14 వరకు పేజీనేషన్ సరిచేసి ఇస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 21 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు. కాగా సీబీఐ నమోదు చేసిన ఛార్జిషీట్ లో ఎమ్మెల్సీ కవితను ఏ17గా చేర్చారు. ఆమెతో సహా మిగత నిందితులను వర్చువల్ గా కోర్టులో హాజరుపర్చారు అధికారులు.

పూర్తిగా చదవండి..