ఈ వార్తను అనువదించండి:

AP వార్తలు: చంద్రబాబు నాయుడు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ చెప్పారు. 50 ఏళ్ల క్రితం చంద్రబాబు ఈ స్థాయికి ఎదుగుతాడని తాను ఊహించలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తిరుపతి టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా తాను, పులిచెర్ల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినట్లు తెలిపారు. రాష్ట్రానికి నాలుగోసారి చంద్రబాబు సీఎం అయ్యారు. ఢిల్లీలో అందరూ చంద్రబాబును బాహుబలి అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారు. కానీ చంద్రబాబు మాత్రం పొద్దున లేస్తే, రాత్రి వరకు ఏపీ అంటే అమరావతి పోలవరం అంటాడన్నారు.

పూర్తిగా చదవండి..