వక్ఫ్ బోర్డ్ భూములు బీఆర్ఎస్, ఎంఐఎం కబ్జా.. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ సెటైర్స్ వేశారు. ఇక వక్ఫ్ బోర్డ్ భూములను గతంలో బీఆర్ఎస్, ఎంఐఎం కబ్జా చేసిందని ఆరోపించారు. మిగిలిన భూములను ఇప్పుడు కాంగ్రెస్ కబ్జా చేయాలని చూస్తోందన్నారు. తమ్ముడు కోసమే రేవంత్ రెడ్డి యూఎస్ వెళ్లాడని ఆరోపించడం తప్పు. కేటీఆర్ సూటు బూటుతో వెళ్లి ఎన్ని ఉద్యోగాలు తెచ్చాడు? కవితకి బెయిల్ ఇవ్వడానికి మేము ఎవరిమి? సిసోడియాకు మేము బెయిల్ ఇచ్చామా? అని ప్రశ్నించారు.