ఈ వార్తను అనువదించండి:

హరీష్ రావు: తెలంగాణలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం అని అన్నారు. నిన్న వరంగ్‌లో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయని చెప్పారు. నార్సింగిలో దివ్యాంగ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో కుక్కలదాడిలో నాలుగేళ్ల చిన్నారి చనిపోయిందని అన్నారు. 8నెలల కాలంలో 343 కుక్కకాటు ఘటనలు జరిగాయని చెప్పారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పూర్తిగా చదవండి..