జోగి రమేష్: అగ్రిగోల్డ్ భూమలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు అధికారులు. తనిఖీల్లో 15 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. సీఐడీ జప్తులో ఉన్న అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అమ్మినట్లు ఏసీబీ అధికారుల గుర్తించారు. మా నాన్నపై కక్షతోనే నన్ను అరెస్ట్‌ చేశారు అని జోగి రాజీవ్‌ ఆరోపించారు. అందరూ కొనుగోలు చేసినట్లే మేం కొన్నాం అని ఆయన అన్నారు.

The post BIG BREAKING: మాజీ మంత్రి జోగి రమేష్‌ కొడుకు అరెస్ట్ appeared first on Rtvlive.com.