ఈ వార్తను అనువదించండి:

Chandrababu Naidu:  ఇది నమ్మశక్యంగా లేదు.. చంద్రబాబులో ఎంతటి మార్పు? ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ విశ్లేషకులు ముక్తకంఠంతో అంటున్న మాట. అవును.. చంద్రబాబు నాయుడు గత రాజకీయ విధానాలకు.. ఇప్పటి నిర్ణయాలకు చాలా తేడా కనిపిస్తోంది. అందుకు తాజా ఉదాహరణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకోవడం. నిజానికి ఇలాంటి వైఖరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో గతంలో ఎప్పుడూ లేదు. ఎన్నిక ఏదైనా సరే.. బలం ఉందా.. లేదా అనేదానితో పని లేదు.. పోటీ పడాల్సిందే. గెలుపు కోసం ఎటువంటి దారిలో అయినా వెళ్లాల్సిందే. ముఖ్యంగా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ధోరణి చాలా ఎక్కువగా ఉండేది. దానికి కారణంగా.. బలం లేదేమో అని పోటీ చేయకపోతే ప్రజల్లో రాంగ్ సిగ్నల్ వెళుతుంది అని చంద్రబాబు కానీ, ఆ పార్టీ నాయకులు గాని చెప్పుకుంటూ ఉండేవారు. అయితే, మొదటిసారిగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వచ్చిన మొదటి ఎన్నికల బరిలో నిలబడడం లేదు అంటూ హుందాగా తప్పుకున్నారు. ఇది రాజకీయ పరిశీలకులను.. ప్రజలను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.

పూర్తిగా చదవండి..