ఈ వార్తను అనువదించండి:

ఇటీవల జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి పాము కాటుతో, మరో విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ స్కూల్ లో నెలకొన్న పరిస్థితులపై మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, పేరెంట్స్ లో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ప్రతిపక్షాలు సైతం గురుకులాల్లో నిర్వహణ సరిగా లేదని విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు ఆ స్కూల్ కు వెళ్లారు. పేరెంట్స్, విద్యార్థులతో స్వయంగా సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

పూర్తిగా చదవండి..