Duvvada Srinivas: ఏపీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి వ్యవహారం సంచలనంగా మారింది. ప్రస్తుతం రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే .అయితే తాజాగా మాధురి ఆరోగ్య పరిస్థితి పై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ మాధురి కావాలనే ప్రమాదానికి గురయ్యేలా డ్రైవింగ్ చేసిందంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో మా ఇద్దరి గురించి వస్తున్నటువంటి వార్తలపై ఆమె పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిందని ఆ డిప్రెషన్ కారణంగానే ప్రమాదానికి గురైందని తెలిపారు.

ఈ ప్రమాదంలో తన తలకు తీవ్రమైన గాయం జరిగిందని ఏడాదిలోపు ఏమైనా జరగొచ్చు అంటూ వైద్యులు తెలిపారని శ్రీనివాస్ తెలిపారు. ఆమెను హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించాలని ఉంది కానీ బయటకు వెళ్తే నా భార్య పిల్లలు నన్ను కబ్జా చేస్తారని ఈయన తెలిపారు.

తలకు తీవ్రగాయం..
నా భార్య వాణి తన వ్యక్తిత్వాన్ని హననం చేసిందని తద్వారా ఆమె తన పుట్టింటికి అలాగే మెట్టినింటికి దూరమైందని దువ్వాడ వెల్లడించారు. అయితే, మాధురి గతంలోనూ ఓసారి ఆత్మహత్యయత్నం చేసిందన్న దువ్వాడ శ్రీనివాస్.. ఆ సమయంలోనే ఆమెను తనే కాపాడానని తెలిపారు. భార్యా భర్తలన్న తర్వాత గొడవలు వస్తే అందరూ భర్తనే వేలెత్తి చూపుతారు. కానీ నా భార్య నాకు నరకం చూపించిందని అందుకే తనకు విడాకులు నోటీసులు కూడా పంపించానని ఈయన తెలిపారు.