Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి వ్యవహారం సంచలనంగా మారింది. ఈమె పెళ్లి జరిగి తన భర్తకు విడాకులు ఇచ్చారని తెలుస్తోంది. ఇలా భర్తకు విడాకులు ఇచ్చిన అనంతరం దువ్వాడ శ్రీనివాస్ దగ్గర అయ్యారని ఈమె కారణంగా తమ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టారు అంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలు ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యవహారం గురించి మాధురి భర్త మహేష్ చంద్రబోస్ స్పందించారు.

మాధురి భర్త మహేష్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు రాజకీయాలు అంటే అసలు ఆసక్తి లేదు కానీ మాధురికి రాజకీయాలు అంటే ఆసక్తి ఉన్న నేపథ్యంలోనే తనని ప్రోత్సహించడంతో వైసిపి పార్టీలోకి వచ్చిందని తెలిపారు.

తన భార్య పట్ల నాకు పూర్తి నమ్మకం ఉంది ఆమె రాజకీయపరంగా ఎదుగుతూ ఉంటే అది చూసి ఓర్వలేనివారు ఆరోపణలు చేస్తున్నారని మహేష్ తెలిపారు. ఇలా మహేష్ పూర్తిగా తన భార్య మాధురికి మద్దతు తెలపడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి అయితే ఈయన తన భార్యకు విడాకులు ఇచ్చారా లేదా అన్నది కూడా స్పష్టత లేదు.

భార్యకు మద్దతు తెలిపిన మహేష్..
ఇక రోడ్డు ప్రమాదానికి గురై హాస్పిటల్ లో ఉన్నటువంటి మాధురి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అనంతరం ఈమె మాట్లాడుతూ.. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కావాలనే నాపై తప్పుడు ఆరోపణలు చేసిందని, ఆ కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానంటూ వెల్లడించారు. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది. వీరి వివాదంలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయి అనేది తెలియాల్సి ఉంది.