ఈ వార్తను అనువదించండి:

పవన్ కళ్యాణ్: సాంకేతిక మంత్రిగా ఉన్నా.. ఇస్రోకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీహరికోటలో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు రాకెట్ ప్రయోగాలు అంటే నాసా గుర్తుకు వచ్చేదని.. కానీ, నేడు మన శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలకు భారత దేశ ఖ్యాతిని చూపించారన్నారు. ఎందరో శాస్త్రవేత్తల త్యాగ ఫలితంగా ఈ రోజు ప్రపంచ దేశాలకు మించి మన రాకెట్ ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. శ్రీహరికోట షార్ లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇస్రోకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా సహకరిస్తుందన్నారు.

పూర్తిగా చదవండి..