సీఎం కేజ్రీవాల్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి నిరాశే ఎదురైంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు గతంలో ఈ కేసులో ట్రయిల్ కోర్టు తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ మరో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఇరువురు తరఫున లాయర్ల వాదనలు విన్న ధర్మాసనం సీఎం కేజ్రీవాల్ కు ఈ కేసులో మధ్యంతరం బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐకి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
వార్తలు అప్డేట్ చేయబడుతున్నాయి..
ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవినీతి కేసులో సీబీఐ తన అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ, బెయిల్ కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
సీబీఐ స్పందన కోరిన సుప్రీంకోర్టు… pic.twitter.com/GJXJXqblYa
– ANI (@ANI) ఆగస్టు 14, 2024
The post BREAKING: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు బిగ్ షాక్ appeared first on Rtvlive.com.