జోగి రమేష్ కొడుకు రాజీవ్: మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్‌ను ACB అధికారులు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జోగి రాజీవ్ విజయవాడ కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో, జోగి రాజీవ్ విజయవాడ ACB కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కౌంటరు దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది.

Also Read: పంద్రాగస్టు పండగ.. పదకొండోసారి ఎర్రకోట పై జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ

అటు, జోగి రాజీవ్ ను 7 రోజులు కస్టడీకి అప్పగించాలని ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు పంపింది. ఈ రెండు పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

The post AP: మాజీ మంత్రి తనయుడి బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా..! appeared first on Rtvlive.com.