• ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల లేటెస్ట్ సెన్సేషన్ కల్కి
  • 50 రోజుల థియేటర్ రన్ పూర్తి చేసుకున్న కల్కి
  • పార్ట్ -2పై త్వరలోనే అధికారక ప్రకటన

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న రిలీజ్ అయి మొదటి రోజూ నుంచి వసూళ్లలో దూసుకు పోతూనే ఉంది. ఇక బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రూ.1100కోట్ల గ్రాస్ రాబట్టింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ ఫీటును సాధించిన చిత్రంగా కల్కి నిలిచింది. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, కమల్‌హాసన్‌, మృణాల్ ఠాకూర్, మాళవిక మోహన్ , రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రల్లో మెరిశారు. మహాభారతం ఇతిహాసంతో అత్యంత భారీ బడ్జెట్‌పై వైజయంతీ బ్యానర్ లో అశ్విన్ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also Read : Mrunal Thakur: ప్రభాస్ సినిమాకు నో చెప్పిన మృణాల్.. కారణం ఇదే.?

కాగా నేటితో కల్కి  థియేటర్లలో రిలీజ్ అయి 50 రోజులు పూర్తయింది. దీంతో చిత్ర బృందం ఓ ప్రత్యేక పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇంతటి భారీ విజయాన్ని అందించినందుకు అందరికి ధన్యవాదాలు నిర్మాణ సంస్థ తెలిపింది. థియేటర్లో సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు.ఈ ఆగస్టు 23 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. దీని హిందీ వెర్షన్‌ మాత్రం అదే తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రంలో ముందునుంచీ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి ‘పార్ట్‌ 2’పై అందరిలోనూ ఆసక్తి పెంచేశాడు.