- వరుస సినిమాలు ప్రకటించిన రజిని
- టాలీవుడ్ సినిమాకు నో చెప్పిన సూపర్ స్టార్
- లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజిని
సూపర్స్టార్ రజినీకాంత్కు ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా ఫాన్స్ ఉన్నారు. ఇటీవల జైలర్ సినిమాతో మరోసారి తన సత్తా ఏమిటో బాక్సాఫీస్ కు చూపించాడు రజని. ప్రస్తుతం జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్షన్లో వెట్టయాన్ తో పాటు, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలి సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. అలాగే జైలర్కు సీక్వెల్గా జైలర్ 2ను తెరకెక్కించాలనుకుంటున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి.
Also Read: Tollywood: టాలీవుడ్ లో మరొక సిక్వెల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
జైలర్ మూవీలో రజినీకాంత్తో పాటు శివ రాజ్కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కూడా నటించారు. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద జైలర్ ఆరు వందల కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టింది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజినీకాంత్కు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ ఆఫర్ చేసింది. రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సినిమలో రామ్ తో పాటు మరొక సీనియర్ హీరో పాత్ర ఉంది. అందుకోసం మైత్రి మేకర్స్ రజనీని ఆ ఆ పాత్ర కోసం సంప్రదించగా ఆ ఆఫర్ను రజని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. తొలుత ఈ రోల్ లో నటించాల్సిందిగా టాలివుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణను సంప్రదించగా ఆయన నో చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత రజినీ సంప్రదించగా అక్కడ నో అనే సమాధానమే వచ్చింది. దీంతో మేకర్స్ ఆ పాత్రకు కన్నడ స్టార్ యాక్టర్ శివ రాజ్కుమార్ను తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్ర దర్శకుడు మహేష్.పి దర్శకత్వం వహిస్తున్నా