• నేడే ఆయ్ స్పెషల్ ప్రీమియర్స్
  • 6ఏళ్ళు కంప్లిట్ చేసుకున్న గీతగోవిందం
  • 6వ రోజు అదరగొట్టిన కమిటీ కుర్రోళ్ళు

నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఈ రోజు సాయంత్రం స్పెషల్ ప్రీమియర్స్ తో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. రెండు తెలుగు రాష్టాలలో ఈ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. అందుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. చిన్న సినిమాగా రానున్న ఆయ్ కు ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది.

Also Read: NBK50 inTFI : ఒకే వేదికపై చిరు – బాలయ్య.. ఫ్యాన్స్ కు పూనకాలే..

కెరీర్ తొలినాళ్లలో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం గీతగోవిందం. ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించడమే కాకుండా విజయ్ దేవరకొండను ఫామిలీ అడియన్సుకి దగ్గర చేసింది. ఈ సినిమా విడుదలై నేటికీ సరిగ్గా 6సంవత్సరాలు అయిన సందర్భంగా ఫ్యాన్స్ మరోసారి ఈ సినిమాను గుర్తుచేసుకుంటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read: Rajni : తెలుగు సినిమాకు నో చెప్పిన తమిళ సూపర్ స్టార్.. కారణాలు బోలెడు..

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ఆగస్ట్ 9న రిలీజైన కమిటీ కుర్రోళ్ళు హిట్ టాక్ తెచుకుంది. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం 6వ రోజు కూడా బుక్ మై షో లో 13K పైగా టికెట్స్ బుకింగ్స్ ఔరా అనిపించింది. బి, సి సెంటర్స్ లో కూడా కమిటీ కుర్రోళ్ళు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు రాబట్టింది.