సీఎం చంద్రబాబు: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుంటారు. రేపు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది.అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. కాగా ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీతో పాటు బీహార్ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక నిధిని మంజూరు చేసింది. అందులో ఏపీకి రూ.15,000 కోట్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

వార్తలు అప్‌డేట్ చేయబడుతున్నాయి…

The post CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. మోదీతో కీలక భేటీ! appeared first on Rtvlive.com.