ఈ వార్తను అనువదించండి:

సిద్ధరామయ్య: కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ముడా స్కామ్‌లో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. గవర్నర్‌ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవిరుద్ధమని ఖండించారు. రాజీనామా చేసేందుకు తానేమీ తప్పు చేయలేదని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కుట్రపన్నాయని ఆరోపించారు. తనకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతల మద్దతు ఉందని అన్నారు. గవర్నర్‌ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికంగా పేర్కొన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.

పూర్తిగా చదవండి..