Ankitha: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ప్రేక్షకులను మెప్పించిన వారిలో అంకిత ఒకరు. ఈమె వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న అంకిత అనంతరం రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సింహాద్రి సినిమాలో నటించారు.

ఈ సినిమాలో అంకితతో పాటు నటి భూమిక కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చీమ చీమ అనే పాట ద్వారా ఎన్టీఆర్ తో పోటీపడి మరి డాన్స్ చేసిన ఈమె ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత అంకిత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయమని అందరూ భావించారు.

ఈమె తదుపరి దొంగలే దొరికితే, విజయేంద్ర వర్మ, మనసు మాట వినదు, రారాజు, ఖతర్నాక్ త‌దిత‌ర చిత్రాల్లో అంకిత న‌టించింది. ఇవ‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఇలా తెలుగులో సక్సెస్ అందుకోలేని అంకిత అనంతరం ఇతర భాషలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న పెద్దగా కలిసి రాలేదు. దీంతో 2010 సంవత్సరంలో ఇండస్ట్రీకి దూరమై 16వ సంవత్సరంలో ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.

అమెరికాలో స్థిరపడిన అంకిత..
అంకిత విశాల్ జగ్తాప్ ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. వివాహం అనంత‌రం అంకిత త‌న భ‌ర్త‌తో క‌లిసి అమెరికాలో న్యూ జెర్సీలో స్థిరపడింది. ఇక ఈయన అక్కడ సిటీ బ్యాంకులో పని చేయడమే కాకుండా ఇతర వ్యాపారాలను కూడా చూసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక అంకితకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ప్రస్తుతం ఈమె తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.