ఈ వార్తను అనువదించండి:

మాధురి: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు, ప్రముఖ యూట్యూబర్ దివ్వెల మాధురి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటానంటూ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. అనారోగ్యం కారణంగా 10 రోజుల పాటు బాహ్యప్రపంచానికి దురంగా ఉండాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బాడీలో బ్లడ్ క్లాట్ అయి బ్లీడింగ్ ఎక్కువ అవుతోందని, దీంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నట్లు చెప్పింది. ‘మీ అందరినీ బాగా మిస్ అవుతాను. నాకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ థ్యాంక్స్. మళ్లీ వచ్చాక అందరితో, అన్నీ వివరంగా మాట్లాడుతా’ అంటూ తన అభిమానులకు వివరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి.

పూర్తిగా చదవండి..