• రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్
  • శంకర్ దర్శకత్వంలో రానున్న గేమ్ ఛేంజర్
  • డిసెంబరు 20న వరల్డ్ వైడ్ రిలీజ్

గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్నచిత్రం ‘గేమ్ ఛేంజర్’. తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్.రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. రెండేళ్లనుండి ఈ సినిమా షూటింగ్ ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టు ఉంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్‌ను రూపొందిస్తున్నాడు దర్శకుడు శంకర్. శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో గేమ్ ఛేంజర్‌ పై రామ్ చరణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు..

Also Raed : Mega Star: చిరు సినిమాకు నో చెప్పిన యంగ్ హీరోయిన్ ఎవరేంటే..?

కాగా, ఇప్పుడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. రామ్ చరణ్ , శంకర్ కలయికలో వస్తోన్నఈ మూవీ ఓవర్సీస్ రైట్స్‌ను పార్స్ ఫిల్మ్ రూ.20 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 5.1 మిలియన్ డాలర్ల రాబట్టాల్సి ఉంది. డిసెంబరు 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్‌కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టడం అంత కష్టమేమి కాదు. అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ దర్శక దిగ్గజం తెలుగులో చేస్తున్న తొలి చిత్రం గేమ్ చేంజెర్ ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు,శిరీష్ నిర్మిస్తున్నారు.