• హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీగా కంగనా
  • రాజకీయాల్లో యాక్టివ్‌గా మారిన నటి
  • తాజాగా పెళ్లిపై తన అభిప్రాయం వ్యక్తం చేసిన నటి

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ఎంపీగా ఎన్నికైన తర్వాత కంగనా రనౌత్ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారింది. ఆమె తదుపరి చిత్రం ‘ఎమర్జెన్సీ’లో కనిపించనుంది. ఇది సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ట్రైలర్‌లో కంగనా రనౌత్ నటనకు ప్రేక్షకులు ఆకర్శితులయ్యారు. పొలిటికల్ మూవీకి ఐదోసారి నేషనల్ అవార్డ్ కైవసం చేసుకోవచ్చని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పుడు ఆమె పెళ్లిపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. నటి అభిమానులు కూడా ఆమె ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.

READ MORE: Pune Porsche case: ఇద్దరికి చావుకు కారణమైన మైనర్.. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నాడు!

యూట్యూబర్ రాజ్ షమణి ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌ని తన పోడ్‌కాస్ట్‌లో పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అని అడిగిగాడు. దానికి ఆమె ‘అవును’ అని సమాధానం చెప్పింది. “ప్రతి ఒక్కరికి భాగస్వామి ఉండాలని నేను భావిస్తున్నాను. భాగస్వామితో కూడా ఇబ్బందులు ఉంటాయి. కానీ భాగస్వామి లేకుంటే సమస్యలు ఎక్కువవుతాయి. మీరు మీ భాగస్వామిని వెతకం పెద్ద సవాలుగా మారుతుంది.” అని స్పష్టం చేసింది. కంగనా రనౌత్ చిన్న వయస్సులో పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించింది. ‘పెద్దయ్యాక ఒకరికొకరు సర్దుకుపోవడం కష్టమవుతుంది. చిన్న వయస్సులో వివాహం చేసుకుంటే, సర్దుబాటు చేసుకోవడం చాలా సులభం అవుతుంది. గ్రామాల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు.’ అని పేర్కొంది.