• మరోసారి జతకట్టబోతున్న సూపర్ హిట్ జోడీ
  • 90 స్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న శివాజీ
  • హీరోగా పలు చిత్రాల్లో నటిస్తున్న శివాజీ

టాలీవుడ్ లో కొందరు హీరో హీరోయిన్లలకు సువర్ హిట్ జోడీ అనే పేరు ఉంది. చిరు రాధికా, బాలయ్య విజయశాంతి, వెంకీ సుందర్య, నాగ్ టబు ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉంది లిస్ట్. వీరిలోనే సీనియర్ హీరో శివాజీ లయ జోడికి సూపర్ హిట్ జోడి అనే పేరు ఉంది. వీరి కాంబోలో మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. శివాజీ హీరోగా, విలన్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలలో నటించాడు. కానీ ఇటీవల కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటూ రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల రాజాకీలయాలకు కాస్త దూరంగా ఉంటూ సినిమాలపై ద్రుష్టి పెట్టారు శివాజీ. ఈ మ‌ధ్యలో బిగ్ బాస్‌లోనూ పాల్గొన్నాడు. బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. .

Also Read: Aakaash Jaganndh: ఆకాష్ జగన్నాధ్ నెక్ట్స్ సినిమా ఏంటో తెలుసా..?

ఆ త‌ర్వాత శివాజీ ముఖ్య పాత్రలో ఈటీవీ విన్ లో వచ్చిన నైంటీస్ అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేశారు. ఆ సిరీస్ చాలా పెద్ద హిట్ అయ్యి శివాజీకి మంచి పేరు తెచ్చి పెట్టింది. చాలా గ్యాప్ తర్వాత మ‌ళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్నాడు శివాజీ. అప్పుడెప్పుడో 2010లో వచ్చిన బ్రహ్మలోకం టు యమలోకం చిత్రంలో లయ తో జతకట్టాడు శివాజీ. దాదాపు 14 ఏళ్ల త‌ర్వాత ల‌య‌తో ఇప్పుడు మ‌రోసారి జతకట్టబోతున్నాడు. నూతన దర్శకుడు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో శివాజీ నటించబోయే సినిమాలో లయను హీరోయిన్ గా ఎంపిక చేసారు.ఈ మూవీని శివాజీ త‌న సొంత నిర్మాణ సంస్థ‌లో చేయ‌బోతుండ‌టం విశేషం.