Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో జరిగిన క్షత్రియ సేవా సమతి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్షత్రియులు ఈయనకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టాలీవుడ్ సెలబ్రిటీలపై ప్రశంసల వర్షం కురిపించారు.

క్షత్రియులు ఏ రంగంలో ఉన్నా కూడా ఎంతో ఉన్నతంగా రాణిస్తారని ఈయన తెలియజేశారు. ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే ఆర్జీవి తనకు ఎంతో మంచి స్నేహితుడని ఈయన తన స్నేహితుడిపై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కృష్ణంరాజు గారు చెరగని ముద్ర వేశారని, కృష్ణంరాజు గారి పేరు చెప్పకుండా తెలుగు సినిమాల గురించి మాట్లాడలేమని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇక కృష్ణంరాజు గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ గురించి ఈయన మాట్లాడుతున్న తరుణంలో ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం సందడి వాతావరణం నెలకొంది. మన తెలుగు సినిమా రేంజ్ ను బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ రేంజ్ కి తీసుకువెళ్లిన నటుడు ప్రభాస్ అని తెలిపారు.

ప్రభాస్ హాలీవుడ్ రేంజ్..
ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిందని వెల్లడించారు. ప్రభాస్ లేకపోతే బాహుబలి సినిమాని ఊహించుకోవడమే కష్టమని ఈయనకు హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ ఉందని తెలిపారు. అయితే ఇంతటి పేరు ప్రఖ్యాతలు రావడం వెనుక వారి కష్టం కూడా ఎంతో ఉంది అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.