ఈ వార్తను అనువదించండి:

Ongole Recounting: ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియ అంటే.. ఎలక్షన్స్ జరగడం.. ఫలితాలు ప్రకటించడం.. ప్రభుత్వం ఏర్పాటు కావడం. ఎక్కడైనా అభ్యర్థులు ఫిర్యాదులు చేస్తే వాటిని పరిశీలించి పరిష్కరించడం.. ఇలాంటివి అన్నీ మనకు తెలుసు. కానీ, తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు రెండు నెలల తరువాత రీ కౌంటింగ్ జరగబోతోంది. అది కూడా 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను రీకౌంటింగ్ చేస్తున్నారు. అందరిలోనూ ఈ రీకౌంటింగ్ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎం కౌంటింగ్ పై తనకు అనుమానాలున్నాయని మాజీ మంత్రి బాలినేని ఫిర్యాదు చేశారు. 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహించాలని బాలినేని కోరారు. దీంతో ఈసీ స్పందించింది. ఈ 12 కేంద్రాల ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహించడానికి సిద్ధం అయింది.

పూర్తిగా చదవండి..