ఈ వార్తను అనువదించండి:
జోగి రమేష్: అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను అసలు జోగి రమేష్ ఫ్యామిలీకి స్థలం అమ్మలేదని పోలవరం మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో నిందితుగా పోలవరం మురళీమోహన్ ఉన్నాడు. తాను జోగి ఫ్యామిలీకి ఎటువంటి భూమి విక్రయించలేదని విచారణలో సీఐడీకి వాగ్మూలం ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..
అయితే మురళీమోహన్ కి భూమి సర్వే నెంబర్ 88 లో ఉంది.. మొదటి జోగి ఫ్యామిలీ సర్వే నెంబర్ 88 తో రిజిస్ట్రేషన్ చేయించుకొని… సర్వేనెంబర్ 87 గా అధికారాన్ని వినియోగించుకుని రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకుందని మురళి ఆరోపించారు. రిజిస్ట్రేషన్ సమయంలో తన పేరుతో వచ్చిన డాక్యుమెంట్స్ గాని, ఆధార్ కార్డు గాని తనది కాదని సీఐడీకి మురళి తెలిపాడు. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు నమోదు చేసేందుకు సీఐడీ అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది.
వార్తలు అప్డేట్ చేయబడుతున్నాయి..
[vuukle]