Venu Swamy: వేణు స్వామి ఏ ముహూర్తాన నాగచైతన్య శోభిత గురించి జాతకం చెప్పారో అప్పటినుంచి ఈయన పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. ఈయన వ్యవహార శైలి పై నేటిజన్స్ మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం జర్నలిస్టులు కూడా మండిపడుతూ ఈయన పట్ల మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. దీంతో ఈయన అరెస్ట్ కూడా అవుతారని వార్తలు వచ్చాయి.

ఇలా నాగచైతన్య శోభిత జాతకం చెప్పిన తర్వాత వచ్చిన విమర్శల కారణంగా వేణు స్వామి భార్య వీణవాణి సైతం ఈ విషయంపై స్పందిస్తూ మీడియా వారి పట్ల ఘాటుగా విమర్శలు చేశారు. దీంతో ఈ వివాదం ముదిరిపోయింది. ఈ క్రమంలోనే మీడియా వారి నుంచి తమకు ప్రాణభయం ఉందని అలాగే మమ్మల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ దంపతులు ఒక వీడియోని విడుదల చేశారు.

ఇకపోతే ఒక ప్రముఖ జర్నలిస్ట్ తమకు 5 కోట్లు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారని మేము అంత ఇవ్వలేము ఇదే మా మరణం వాంగ్మూలం అంటూ వేణు స్వామి దంపతులు ఒక వీడియోని విడుదల చేయడమే కాకుండా ఆ జర్నలిస్ట్ డబ్బును డిమాండ్ చేసిన ఒక ఆడియోని కూడా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ విషయం కాస్త వివాదంగా మారింది.

ఇకపోతే వేణు స్వామి జర్నలిస్టు మూర్తి పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారడంతో మూర్తి ఈ వ్యాఖ్యలపై స్పందించారు. వేణు స్వామి నా గురించి చేస్తున్న ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. ఈ ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. నేను ఆయన నుంచి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు కనుక నిరూపితం అయితే మీరు నన్ను ఇక్కడే కొట్టి చంపేయండి అలా నిరూపించలేక పోతే వేణు స్వామి ఆత్మహత్య చేసుకోవద్దని తెలిపారు.

రూపాయి ఆశించలేదు..
నా 30 సంవత్సరాల జర్నలిజంలో ఎప్పుడు కూడా నేను ఎవరికి తల వంచలేదని అప్పట్లో ఉమ్మడి ఏపీ గవర్నర్ ఎన్ డి తివారి కేసును కూడా తానే బయట పెట్టానని అలాంటి హై ప్రొఫైల్ కేసులోనే నేను రూపాయి ఆశించలేదు. ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తాను అంటూ వేణు స్వామి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.