రిషిత, ఫైజల్, షేక్ అల్లాబక్షు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “కావేరి” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను సాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబక్షు నిర్మాతగా రాజేష్ నెల్లూరు డైరెక్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కావేరి సినిమా, ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోన్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ఫైజల్ మాట్లాడుతూ మాలాంటి కొత్తవాళ్లకు అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తాం, ఎంతోమంది ఫొటోస్ పట్టుకుని అవకాశాల కోసం తిరుగుతుంటారు కానీ ఆ అవకాశం మాకు దక్కింది అన్నారు.

హీరోయిన్ రిషిత మాట్లాడుతూ – పేరెంట్స్ ఎప్పుడూ అమ్మాయిలకే జాగ్రత్తలన్నీ చెబుతుంటారు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది. ఇవే జాగ్రత్తలు అబ్బాయిలకు చెబితే అమ్మాయిల పట్ల ఇన్ని అకృత్యాలు ఈరోజు సొసైటీలో జరగవు. ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే అదే తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురవుతారు, మా సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది అని పేర్కొంది. డైరెక్టర్ రాజేష్ నెల్లూరు మాట్లాడుతూ కావేరి క్యారెక్టర్ బోల్డ్ గా, రా అండ్ రస్టిక్ గా ఉంటుంది, ఈ క్యారెక్టర్ లో రిషిత ఆకట్టుకునేలా నటించారని అన్నారు.