ఈ వార్తను అనువదించండి:

సుప్రీంకోర్టు: కోల్‌కతా హత్యాచారఘటనపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మహిళలు, యువ వైద్యుల భద్రతపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన భయానకం. 12 గంటలు ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేశారు?, ప్రిన్సిపల్‌ ఏం చేస్తున్నారు? ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారు? అని ఫైర్ అయింది. దీనిపై గురువారంలోగా దర్యాప్తు స్టేటస్‌ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐకి ఆదేశం ఇచ్చింది. వైద్యుల రక్షణపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. 10 మంది ప్రముఖ వైద్యులతో కూడిన జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హైదరాబాద్‌కు చెందిన డా. నాగేశ్వర్ రెడ్డికి చోటు దక్కింది.

పూర్తిగా చదవండి..