• ఏరి కోరి బ్లాక్ బస్టర్ సినిమా నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ

  • ఆయ్ అనే సినిమాలో ముందుగా భాగ్యశ్రీని హీరోయిన్

  • రవితేజ సినిమాలో కూడా ఆఫర్ రావడంతో ఆయ్ నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ

Bhagyashri Borse Missed Aay for Mr Bachchan Movie: ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు కెరీర్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి నిర్ణయం ఒకటి తీసుకుని ఇప్పుడు వార్తలలోకి ఎక్కింది భాగ్యశ్రీ బోర్సే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా భాగ్యశ్రీ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ మరాఠీ భామ నిజానికి తెలుగులో మరో సినిమాతో లాంచ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా హరీష్ శంకర్ హీరోయిన్ గా లాంచ్ అవ్వాల్సి వచ్చింది. హరీష్ శంకర్ హీరోయిన్ గా లాంచ్ అయితే సుదీర్ఘమైన కెరియర్ ఉంటుందని దానికి తోడు రవితేజ పక్కన హీరోయిన్గా నటిస్తే ఖచ్చితంగా స్టార్ అయిపోవచ్చని నమ్మకంతోనే ఆమె ముందు అనుకున్న సినిమా నుంచి తప్పుకుని ఈ సినిమా ఒప్పుకుందట.

Silk Smitha: వేలంలో సిల్క్ స్మిత కొరికిన ఆపిల్.. ఎంత పలికిందో తెలిస్తే షాకే!

అయితే ఆమె ముందు ఒప్పుకుని సైన్ చేసిన మరో సినిమా మాత్రం ఇప్పుడు అనూహ్యంగా హిట్ అయింది. అదే రోజు రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ మాత్రం మిక్స్ టాక్ తో నిలిచిపోయింది. అసలు విషయం ఏమిటంటే ఎన్టీఆర్ బావమరిది హీరోగా తెరకెక్కిన ఆయ్ అనే సినిమాలో ముందుగా భాగ్యశ్రీని హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అయితే ఆమెకు రవితేజ సినిమాలో కూడా ఆఫర్ రావడంతో ఈ సినిమా చేయలేనని చెప్పిందట. అయితే ఆమె కోసం సుమారు 6 నెలలు టీం వెయిట్ కూడా చేసిందట. ఆ తరువాత ఆమె కుదరదని చెప్పడంతో మరో రెండు మూడు ఆప్షన్స్ చూసి అందులో బెస్ట్ అనుకున్న నయన్ సారికను ఫైనల్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయ్ సినిమా హిట్ అవ్వగా మిస్టర్ బచ్చన్ మిక్స్ టాక్ తెచ్చుకుంది. అలా మొత్తం మీద భాగ్యశ్రీ తీసుకున్న డిసిషన్ ఆమెకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు.