Jani Master: ఇటీవల జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన తమిళ చిత్రం తిరుచిత్రంబలం సినిమాలోని మేఘం అనే పాటకు కొరియోగ్రఫీ అందించినందుకుగాను నేషనల్ అవార్డు అందుకున్నారు. దీంతో ఈయనకు పెద్ద ఎత్తున చిత్ర పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలాగే ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరికీ కూడా ఎంతో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించారు ఇలా జానీ మాస్టర్ సూపర్ హిట్ సాంగ్స్ అందించిన వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు.

జులాయి సినిమాలో నుంచి మొదలుకొని సన్నాఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురం, రేసుగుర్రం వంటి సినిమాలలో సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ అందించారు దీంతో అల్లు అర్జున్ జానీ మాస్టర్ మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ ఆయనకు విశేష్ చెప్పకుండా కొంతమంది సెలబ్రిటీల పేర్లను ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అల్లు అర్జున్ జానీ మాస్టర్ మధ్య మంచి అనుబంధమున్నా ఆయనకు నేషనల్ అవార్డు వచ్చిన బన్నీ విషెస్ చెప్పకపోవడానికి కారణం జానీ మాస్టర్ జనసేన పార్టీకి మద్దతు తెలపడమేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ జనసేన పార్టీకి మద్దతు తెలిపారు.

మర్చిపోయి ఉండవచ్చు..
అల్లు అర్జున్ జనసేన పార్టీ మెగా ఫ్యామిలీకి మధ్య ఇటీవల కాలంలో వివాదాలు తలెత్తాయి. అందుకే జానీ మాస్టర్ కి కూడా ఈయన విషెస్ చెప్పలేదంటూ ట్రోల్స్ వచ్చాయి. అయితే ఈ ట్రోల్స్ పై జానీ మాస్టర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ గారు నాకెందుకు విషెస్ చెప్పలేదో తెలియదు. బహుశా ఆయన మర్చిపోయి ఉండవచ్చు కానీ నేను ఈ విషయాన్ని నెగిటివ్ గా తీసుకోలేదు. నిజానికి బుట్ట బొమ్మ పాటకే అవార్డు వస్తుందనుకున్నాము కానీ ఈ పాటకు వచ్చింది. నేను మాత్రం నా పనిని పూర్తిగా నమ్ముతానని ఈయన తెలిపారు.