ఈ వార్తను అనువదించండి:

మేఘా కృష్ణారెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు మధ్య కాంప్రమైజ్ చేశాడని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మేఘా కంపెనీకి ఒక శాపంలా మారిందన్నారు. ఆర్టీవీకి పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తెలంగాణలో మేఘా సంస్థ దోపిడితో పాటు అనేక తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మేఘా కృష్ణారెడ్డి వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని చెరబడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుంటున్న మేఘా కష్ణారెడ్డిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే తాను బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. తాను ఏ అవకాశం వచ్చినా మేఘా అవినీతిపై గొంతెత్తుతున్నానన్నారు.

పూర్తిగా చదవండి..