ఎమ్మెల్సీగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన బొత్స సత్యనారాయణకు వైసీపీ అధినేత జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. శాసనమండలి పక్ష నేతగా బొత్సను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రంలోగా వైసీపీ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటివరకు ఆ పార్టీ శాసనమండలి పక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి.. ఫ్లోర్ లీడర్ రాజీనామా చేశారు. జగన్ ఆదేశాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్త అప్డేట్ అవుతోంది..

The post BIG BREAKING: బొత్సకు కేబినెట్ ర్యాంక్ పదవి.. జగన్ సంచలన నిర్ణయం! appeared first on Rtvlive.com.